Gopichan Sahasam Latest Photo

గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం 'సాహసం' జూలై 12న విడుదల కానుంది. తాప్సీ కథానాయిక.
ఈ సినిమా గురించి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'ఈ చిత్రం ఆడియో ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. రీరికార్డింగ్‌కి ఎంతో ప్రాధాన్యం ఉన్న మా సినిమాకి సంగీతదర్శకుడు శ్రీ మంచి ఆర్.ఆర్. ఇచ్చారు. గోపీచంద్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వస్తున్న ఎడ్వంచరస్ ఎంటర్‌టైనర్ ఇది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా, చంద్రశేఖర్ స్టయిల్‌లో ఉండే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గోపీచంద్‌కి మరో విజయాన్ని అందించే సినిమా ఇది. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం' అన్నారు.
ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌దత్ ఎస్., ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు.

Tags: News, Telugu News, Andhra News

0 comments:

Post a Comment

 
Top