నటుడు మోహన్ బాబు తన నూతన సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతుండగా పడవ ప్రమాదంలో నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కు రిహార్సల్ చేస్తున్నాడు. జెట్ స్కై ను మొదటిసారి నడపినప్పుడే ఈ సంఘటన చోటుచేసుకుంది.
మోహన్ బాబును సినిమా బృందం రక్షించారు. ఆయన, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనివల్ల షూటింగ్ కాసేపు ఆగిపోయింది. వీరిద్దరూ క్షేమంగా చేరుకునేసరికి దర్శకుడు ఊపిరిపీల్చుకున్నాడు.

మంచు వంశం అంత కలిసినటిస్తున్న ఈ మెగా ఎంటర్టైనర్ కోసం మోహన్ బాబు, విష్ణు, మనోజ్ ఈరోజు ఉదయం జెట్ స్కయింగ్ చేసారు. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మరియు లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం నలుగురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.

Tags: News, Telugu News, Andhra News

0 comments:

Post a Comment

 
Top