విశాఖ జిల్లాలో షర్మిల ప్రజాప్రస్థానం నాన్ స్టాప్ గా సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ..ముందుకు పోతున్న షర్మిల..కాంగ్రెస్, టీడీపీలపై విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పాలక ప్రతిపక్షాలు విఫలమయ్యాయని షర్మిల విమర్శించారు. 

విశాఖ జిల్లాలో షర్మిల  మరో ప్రజాప్రస్థానం జోరుగా సాగుతోంది. శనివారం రావికమతం మండలం లులూరు నుంచి  ప్రారంభమైన యాత్ర..చోడవరం వరకు సాగింది. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు షర్మిల. చోడవరంలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. సర్కార్ అసమర్దత రైతులు, పేదలు కష్టాల పాలయ్యారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలు పరిష్కరించడంలో పాలక, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని విమర్శించారు. 

షర్మిల పాదయాత్రకు విశాఖ జిల్లా వాసులు దారిపొడవునా స్వాగతం పలికారు. రాత్రి చోడవరంలో బస చేసిన షర్మిల..ఇవాళ అక్కడి నుంచే యాత్రను కంటిన్యూ చేయనున్నారు. 

Tags: Telugu News, News, Andhra News

0 comments:

Post a Comment

 
Top