విజయవాడ, జూన్ 29 : పిల్ల కాంగ్రెస్ నేతలు తమ బ్యానర్లలో ఎన్టీఆర్ ఫోటో పెడితే చెప్పుతో కొట్టండి అని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 1994 ఫలితాలు పునరావృత్తం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మరింత జఠిలం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ తన కుమారుడు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు చంచల్‌గూడా జైళ్లో వైఎస్ జగన్ నెంబర్ వన్ గానే ఉన్నారని రేవంత్‌రెడ్డి యెద్దేవా చేశారు.

Tags: News,Telugu News, AP News, Andhra News

0 comments:

Post a Comment

 
Top