హైదరాబాద్, జూన్ 29: పీసీసీ చీఫ్ బొత్స, మంత్రి శైలజానాథ్‌లతో కలిసి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు శనివారం నాడు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కావూరి ప్రసంగిస్తూ "నా మాటలను మీడియా వక్రికరించింది'' అని వ్యాఖ్యానించారు.

తెలంగాణ విషయంలో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని ఆయన పునరుద్ఘాటించారు. మంత్రి శైలజానాథ్‌ను పీసీసీ అధ్యక్షునిగా చేస్తే సమైక్యాంధ్ర నినాదం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయ్యానో అప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం ఆలోచనల ప్రకారమే నడుచుకుంటున్నానని ఆయన విశదీకరించారు.

Tags: News, Telugu News, AP News, Andhra News

0 comments:

Post a Comment

 
Top